ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కోర్టులో ఈ పిటిషన్ పై పలు విడతలుగా సుదీర్ఘ విచారణ జరగగా ఇరువర్గాలు వారు వాదనలు వినిపించారు. బెయిల్ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పిటిషన్ దాఖలు చేయబడిందని సీఎం జగన్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇప్పటికే విచారణ పూర్తయిన నేపథ్యంలో బుధవారం నాడు ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా ఈ అంశంలో సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో రివ్యూ పిటీషన్ వేయనున్నట్టు ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ