దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ హెఛ్ఐసీసీలోని నోవాటెల్ లో సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్నవారు మరియు కలిసి పనిచేసిన తెలంగాణ, ఏపీకి చెందిన దాదాపు 300 మందికి పైగా ప్రముఖులను ఈ సభకు వైఎస్ విజయమ్మ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. వీరిలో రాజకీయ రంగంతో పాటుగా ఐఎస్ఎస్, ఐపీఎస్, సినీ, వ్యాపార, వైద్య, పత్రికా రంగాలకు చెందినవారు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా గతంలో వైఎస్ఆర్ తో కలిసి పనిచేసినవారు పలువురు ప్రస్తుతం టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీల్లో కొనసాగుతున్నారు. ఈ సంస్మరణ సభలో ఎవరెవరు పాల్గొంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ