వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 గురు సభ్యులతో పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీని నియమించారు. ఉమ్మడి జిల్లాలలోని నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటుగా వారిని చైతన్య పరచడానికి రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యులను నియమిస్తున్నట్టు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ మేరకు వైఎస్ఆర్టీపీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదంటూ డిసెంబర్ లో వైఎస్ షర్మిల నిరహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. నిరహార దీక్ష వలన తన ఆరోగ్యం దెబ్బతిందని, కొద్దీ రోజులు విశ్రాంతి అనంతరం సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి రాష్ట్రంలో తన పాదయాత్ర కొనసాగిస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించిన వైఎస్ షర్మిల, పాలేరులో నూతన వైఎస్ఆర్టీపీ కార్యాలయ నిర్మాణానికి కూడా డిసెంబర్ లోనే భూమి పూజ నిర్వహించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీ సభ్యులు వీళ్ళే:
- గట్టు రామచంద్ర రావు
- కొండా రాఘవ రెడ్డి
- పిట్ట రాంరెడ్డి
- ఏపూరి సోమన్న
- గడిపల్లి కవిత
- నీలం రమేష్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE