శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 28 వ పాఠంలో నాటకానికి, సినిమాకి మధ్యగల తేడాలను వివరించారు. ఒకప్పుడు నాటకాలను కూడా మూడు గంటలపాటు వేసేవారని చెప్పారు. నాటకం తర్వాత ఎలా మారింది, సినిమాలకు ఎలా ప్రాధాన్యత పెరిగిందనే అంశాలను ఈ వీడియోలో తెలియజేశారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇