తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మంత్రి సతీమణికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ఆయనే స్వయంగా ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ఆదివారం నాడు కరోనా పాజిటివ్ గా తేలిందని, ఒకరోజు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నానని చెప్పారు. ఆరోగ్యంగానే ఉన్నానని, ఇబ్బంది ఏమి లేదని అన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఆగస్టు 7, గురువారం నాటికీ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 77,513 కి చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu