దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం నాడు సికింద్రాబాద్ ఆర్డీవో కార్యాలయంలో 157 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
పేదింటి ఆడపడుచుల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష 1116 రూపాయల ఆర్ధిక సహాయం అందించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వృద్దులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఆసరా పెన్సన్ లు అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పేదప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానాలను కూడా ప్రారంభించినట్లు వివరించారు. ప్రజలంతా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu