భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 84 లక్షలు దాటింది. నవంబర్ 6, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 84,11,724 కు, మరణాల సంఖ్య 1,24,985 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 47,638 కరోనా పాజిటివ్ కేసులు, 670 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటికే 77 లక్షల మందికి పైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకే రోజులో 54,157 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 77,65,966 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 92.32 శాతంగా నమోదైంది. కాగా కరోనా మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5,20,773 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశంలో నవంబర్ 5 నాటికీ 11,54,29,095 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 12,20,711 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ