ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త అందింది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్ కు సంబంధించి చెల్లించాల్సిన పలు రకాల ఫీజులను రద్దు చేస్తున్నట్టుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. బోర్డు నిర్ణయించిన విధంగా రద్దు చేయబడిన ఫీజులను విద్యారుల నుంచి వసూలు చేయవద్దని ప్రిన్సిపాల్స్ కు ఏపీ ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.
ఇంటర్ కు సంబంధించి రద్దు చేయబడిన ఫీజులివే:
- రీ-అడ్మిషన్ ఫీజు : రూ.1000
- టీసీ అడ్మిషన్స్ ఫీజు : రూ.1000
- సెకండ్ లాంగ్వేజ్ మార్చుకునే ఫీజు : రూ.800 – ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే
- మీడియం మార్పు ఫీజు : రూ.600 – ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే
- గ్రూప్ మార్పు ఫీజు : రూ.1000 – ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే
- గ్రూప్ మార్పు ఫీజు : రూ.1000 – సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులకు
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ