ప్రముఖ సినీనటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశంపై ఇటీవల కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని, పార్టీకి సంబంధించిన వివరాలను డిసెంబర్ 31 వెల్లడించనున్నటు తెలిపారు. 2021 లో ఏప్రిల్ లేదా మే లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పెట్టబోతే పార్టీ పేరు, పార్టీ గుర్తుపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. “మక్కల్ సేవై కట్చి” పేరుతో ఎన్నికల సంఘంలో రజనీకాంత్ పార్టీని నమోదు చేసారని, ఆయన పార్టీకి ఆటో గుర్తు కేటాయించినట్లు తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం తాజాగా కొన్ని పార్టీలకు గుర్తులు కేటాయించగా, తమిళనాడుకు చెందిన మక్కల్ సేవై కట్చి పేరుతో ఉన్న పార్టీకి ఆటో గుర్తును కేటాయించింది. దీంతో ఈ పార్టీ మరియు గుర్తు రజనీకాంత్ కు చెందినవే అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ