రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ 3 ఉద్యోగుల సంఘాల ఆఫీసు బేరర్లతో, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్–గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ లతో బుధవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం అయింది. పీఆర్సీ సిఫార్సులు మరియు ఇతర సమస్యలకు సంబంధించి 3 ఉద్యోగుల సంఘాలు మరియు వారి అభిప్రాయాలు, ప్రతిపాదనలను త్రిసభ్య కమిటీ అసోసియేషన్ వారీగా విన్నారు. పీఆర్సీ సిఫార్సులు మరియు ఇతర సంబంధిత విషయాలకు సంబంధించిన ఉద్యోగుల సమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్ సానుకూలంగా స్పందించి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, వివిధ ఉద్యోగుల సంఘాల ఆఫీస్ బేరర్లు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.మమత, జనరల్ సెక్రెటరీ ఎ.సత్యనారాయణ, యం.బి.క్రిష్ణ యాదవ్, టీఎన్జీవో ప్రెసిడెంట్ యం.రాజేందర్ , వైస్ ప్రెసిడెంట్ రేచల్, సిటీ ప్రెసిడెంట్ ముజిబ్, జనరల్ సెక్రెటరీ యం.ప్రతాప్, సెక్రటేరియట్ ఆఫీసర్స్ మరియు ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.నరెందర్ రావు, జనరల్ సెక్రెటరీ లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ