ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. అప్పుడప్పుడు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, సమస్యల పరిష్కారం కోసం లేఖలు రాయటం ముద్రగడ పద్మనాభంకు అలవాటే. అయితే, తాజాగా రాసిన లేఖ మాత్రం కొంచెం సంచలంగా మారింది. ఈసారి ముద్రగడ పద్మనాభం ఓటీఎస్ పై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖను రాశారు. ఓటీఎస్ విధానంపై జగన్ సర్కార్ ను ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హాయంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని లేఖ ద్వారా సీఎంను కోరారు ముద్రగడ. గత ప్రభుత్వాలు ఎప్పుడో పేదవారికిచ్చిన రుణాలను ఇప్పుడు ఓటీఎస్ పేరుతో వసూలు చేయడం ఇప్పటి వరకూ జరగలేదని లేఖలో తెలిపారు ముద్రగడ. గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు పేదలకు కట్టి ఇచ్చిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు చేసే అధికారం ఎక్కడిది అంటూ సీఎం వైఎస్ జగన్ను ముద్రగడ ప్రశ్నించారు.
అలాగే, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని, వారిని ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు ముద్రగడ. ఇప్పటికే ఓటీఎస్ విధానంపై అనేక విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్.. శుక్రవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక సవరణలకు ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ముద్రగడ.. ఓటీఎస్ పేరుతో పేద ప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ లేఖలో సిఎం జగన్ ను కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF