మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2022-23 సంవత్సరానికి గానూ 6, 7, 8వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం జూన్ 19న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రవేశ పరీక్ష కోసం హాల్ టికెట్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్యబట్టు ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారంతా హాల్ టికెట్లను http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష, హాల్ టికెట్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-23322377, 23328266 ఫోన్ నెంబరులో సంప్రదించాని సూచించారు. ఇక జూన్ 19న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఆయా తరగతులకు విద్యార్థులు ఎంపిక చేయబడతారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY