జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) చైర్ పర్సన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు షాక్ తగిలింది. మణిపూర్ రాష్ట్రంలో గత మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించారు. తాజాగా ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. జేడీయూ ఎమ్మెల్యేలు ఖుముక్చమ్ జోయ్కిషన్ సింగ్, న్గుర్సంగ్లూర్ సనేట్, ఎండీ అచాబ్ ఉద్దీన్, తంజామ్ అరుణ్కుమార్ మరియు ఎల్ఎం.ఖౌటే బీజేపీలో చేరినట్టు మణిపూర్ స్పీకర్ తోక్చోమ్ సత్యబ్రత సింగ్ తరపున అసెంబ్లీ ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. ఆరుగురిలో ఐదుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన నేపథ్యంలో మణిపూర్ జేడీయూ శాసనపక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా మణిపూర్ అసెంబ్లీ కార్యదర్శి కె.మేఘజిత్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవలే బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు సీఎం నితీష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం ఆర్జేడీ కూడిన మహా గట్ బంధన్ కూటమితో కలిసి నితీష్ కుమార్ బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మణిపూర్ లో జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం, ఆపరేషన్ కమలం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలపై బీహార్ బీజేపీ ఎంపీ, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ట్వీట్ చేస్తూ, “అరుణాచల్ తర్వాత మణిపూర్ కూడా జేడీయూ ఫ్రీగా మారింది. అతి త్వరలో లాలూజీ బీహార్ను కూడా జేడీయూ రహితంగా మారుస్తారు” అని పేర్కొన్నారు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని జేడీయూ ఆరోపిస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY