టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా ఎంపీ కేశవరావు ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్ 19న రాజ్యసభ చైర్మన్ కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.
“నన్ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యక్తిగత కారణాల వల్ల నా సభ్యత్వానికి రాజీనామా చేయాలనుకుంటున్నాను.సభ్యత్వాన్ని వదులుకోవాలనే నా ఉద్దేశ్యాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్కి ఇప్పటికే తెలియజేశాను” అని రాజ్యసభ చైర్మన్ కు రాసిన లేఖలో కేశవరావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY