తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని, ముందుగా అందుకోసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) మెంబర్ల నియామకాలు వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 9 విశ్వవిద్యాలయాలకు పాలకమండలి (ఈసీ) సభ్యులను నియమించింది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, జేఎన్యూఎఫ్ఏ, ఇతర విశ్వవిద్యాలయాల వారీగా ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు వేర్వేరుగా జీవోలు జారీచేసింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల్లో ఐదుగురు ఎక్స్అఫీషియో మరియు నలుగురు ప్రముఖులతో కలిపి ఒక్కో విశ్వవిద్యాలయానికి మొత్తం తొమ్మిది మందిని నియమించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
[subscribe]