తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో ఉండే జూనియర్ లెక్చరర్లు (జేఎల్) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇటీవలే నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 27 సబ్జెక్ట్స్ కు సంబంధించి మొత్తం 1392 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ముందుగా అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 2022, డిసెంబర్ 16వ తేదీ నుంచి 2023, జనవరి 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే జూనియర్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రారంభ తేదీ మార్పుపై టీఎస్పీఎస్సీ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. సాంకేతిక కారణాల వల్ల జేఎల్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు 2022, డిసెంబర్ 20వ తేదీ నుండి ప్రారంభమవుతాయని మరియు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2023, జనవరి 10వ తేదీ సాయంత్రం 05:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.
ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లోని వివిధ సబ్జెక్టులలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉన్న అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ (https://www.tspsc.gov.in) ని సందర్శించి, నిర్ణీత ప్రొఫార్మాలో డిసెంబర్ 20 నుండి జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. మొత్తం 1392 పోస్టులు భర్తీ చేయనుండగా, ఇందులో మల్టీ జోన్-1 పరిధిలో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులు ఉన్నాయి. అలాగే రాత పరీక్షను 2023, జూన్/జూలై నెలల్లో నిర్వహించే అవకాశాలున్నట్లు గతంలోనే టీఎస్పీఎస్సీ తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE