ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం, మే 11, 2023) విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ, క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం, ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్ తదితర కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవనున్న ఆయన పర్యటన రాత్రి 8:30 గంటల సమయంలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబదించిన షెడ్యూల్ను ఏపీ సీఎంఓ ప్రకటించింది.
సీఎం జగన్ విశాఖ పర్యాటన వివరాలు, షెడ్యూల్ ప్రకారం..
- సీఎం జగన్ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖ చేరుకుంటారు.
- అక్కడి నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్ఆర్ స్టేడియంకు చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. - సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ సమీపంలోని అపోలో ఆసుపత్రికి చేరుకుని అపోలో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
- కార్యక్రమంలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు.
- అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హారియర్ యుద్ధ విమానాల మ్యూజియాన్ని ప్రారంభిస్తారు.
- దీంతోపాటు రాంనగర్లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను అక్కడి నుంచి ప్రారంభించనున్నారు.
- అనంతరం ఎండాడలో కాపు భవనానికి, భీమిలిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన చేస్తారు.
- అక్కడి నుంచి సాయంత్రం 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్కు చేరుకుంటారు.
- అక్కడ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్ లో పాల్గొంటారు.
- అనంతరం తిరిగి 7 గంటలకు తిరిగి 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE