ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2000 దాటింది. మే 11, సోమవారం ఉదయానికి పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,409 సాంపిల్స్ కి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 38 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. కొత్తగా చిత్తూరు, కర్నూల్ జిల్లాలలో 9 చొప్పున, అనంతపూర్ జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 5, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలలో 3 చొప్పున, నెల్లూరులో ఒక కేసుతో కలిపి మొత్తం 38 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో నమోదైన 9 కేసుల్లో 8 కేసులు కోయంబేడు(తమిళనాడు) నుంచి వచ్చినవిగా పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2018 పాజిటివ్ కేసులకు గాను 997 మంది డిశ్చార్జ్ కాగా, 45 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 975 మంది చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 115
- చిత్తూరు – 121
- కర్నూల్ – 575
- కడప – 97
- తూర్పుగోదావరి – 46
- పశ్చిమ గోదావరి – 68
- నెల్లూరు -102
- ప్రకాశం – 63
- గుంటూరు – 387
- కృష్ణా – 342
- శ్రీకాకుళం – 5
- విజయనగరం – 4
- విశాఖపట్నం – 66
- ఇతరులు (గుజరాత్ నుంచి వచ్చిన వారు 26 మంది, కర్ణాటక నుంచి ఒక్కరు )-27
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu