ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జనవాణి కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘జనవాణి-జనసేన భరోసా’ కార్యక్రమం స్ఫూర్తితో పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకొని పవన్ కళ్యాణ్ చెంతకు తీసుకొచ్చేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టిన జన సైనికుడు బాలాజీని పవన్ కళ్యాణ్ సోమవారం అభినందించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది.
పల్నాడు ప్రాంతంలో బాలాజీ పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించి వాటిని పవన్ కళ్యాణ్ కు అందజేసేందుకు ‘పల్నాడు ప్రజా సమస్యల పెట్టె’ పేరిట కార్యక్రమం చేపట్టనున్నారు. సొంత వాహనంపై గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించనున్నారు. జన సైనికుడు బాలాజీ ఆలోచన మెచ్చిన పవన్ కళ్యాణ్ అతనికి ప్రోత్సాహక నగదు, మొబైల్ ఫోన్ బహుకరించినట్టు ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE