నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు (ఆగస్టు 7, శుక్రవారం) నుంచే నీటి విడుదల ప్రారంభం కావాలని నాగర్జున సాగర్ సీఇని సీఎం ఆదేశించారు. కృష్ణానది ఎగువన నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉన్నందున, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉన్నందున నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉన్న సాగర్ ఆయకట్టు రైతులకు ఈ వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu