ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 402 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 10, శుక్రవారం రాత్రి నుంచి ఏప్రిల్ 11, శనివారం ఉదయం వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు వెల్లడించారు. గుంటూరులో జిల్లాలో 14 మందికి, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ప్రకటించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా, అందులో 37 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ వైరస్ వలన ఆరుగురు మరణించగా, 11 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయినట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 385 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu