భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. ఏప్రిల్ 11, శనివారం ఉదయం 8 గంటల వరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 7,447 కు చేరుకుంది. గత 24 గంటల్లో 1,035 కొత్త కేసులు నమోదు కాగా, 40 మంది మరణించారు. ప్రస్తుతం 6,565 మంది చికిత్స పొందుతుండగా, 642 మంది కోలుకున్నారు. కాగా ఈ వైరస్ వలన ఇప్పటివరకు 239 మంది మరణించారు. ఇప్పటిదాకా 7 రాష్ట్రాల్లో 20 లోపు కేసులు నమోదుకాగా, 9 రాష్ట్రాల్లో 20 – 300 లోపు కేసులు నమోదయ్యాయి. ఇక 10 రాష్ట్రాల్లో 300 కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
1-20 లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- అరుణాచల్ ప్రదేశ్ – 1
- మిజోరం – 1
- త్రిపుర – 1
- మణిపూర్ – 2
- గోవా – 7
- జార్ఖండ్ – 14
- ఛత్తీస్ ఘడ్ – 18
20-300 లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- హిమాచల్ ప్రదేశ్ – 28
- అస్సాం – 29
- ఉత్తరాఖండ్ – 35
- బీహార్ – 39
- ఒడిశా – 44
- పశ్చిమ బెంగాల్ – 116
- పంజాబ్ – 132
- హర్యానా – 177
- కర్ణాటక – 207
300 కంటే ఎక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రాలు:
- గుజరాత్ – 308
- కేరళ – 364
- ఆంధ్రప్రదేశ్ – 402
- ఉత్తర ప్రదేశ్ – 431
- మధ్యప్రదేశ్ – 435
- తెలంగాణ – 473
- రాజస్థాన్ – 553
- ఢిల్లీ – 903
- తమిళనాడు – 911
- మహారాష్ట్ర – 1574
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu