ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకు మరింతగా ప్రభావం చూపుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 87 కు చేరుకుంది. మార్చ్ 31, మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత నుంచి ఏప్రిల్ 1 బుధవారం ఉదయం 9 గంటల వరకు కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు ప్రకటించారు. గడిచిన 12 గంటల్లో మొత్తం 373 శాపిళ్లను పరీక్షించగా 43 పాజిటివ్గా, 330 నెగిటివ్గా వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు కడప, ప్రకాశం జిల్లాలలో అత్యధికంగా 15 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 , విశాఖపట్నంలో 11, గుంటూరులో 9, కృష్ణా జిల్లాలో 6, తూర్పుగోదావరిలో 6, చిత్తూరులో 6 , అనంతపురంలో 2, నెల్లూరులో 3, కర్నూలు జిలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
రాష్ట్రంలో నిన్న (31.3.2020) సాయంత్రం 9 గంటల తర్వాత నుంచి ఈ రోజు (01.04.2020) ఉదయం 9:00 వరకు 43 కొత్త కొవిడ్-19 పోజిటివ్ కేసులు నమోదయ్యాయి.
వీటితో కలిపి మొత్తం 87 పాజిటివ్ కేసులు రాష్ట్రము లో నమోదయ్యాయి.@AndhraPradeshCM @MoHFW_INDIA #APFightsCoronaVirus #COVID #covidupdate pic.twitter.com/NgP9hMi8FN— ArogyaAndhra (@ArogyaAndhra) April 1, 2020