ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 21, గురువారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2452 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 8,092 సాంపిల్స్ ని పరీక్షించగా 45 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. కోవిడ్ వలన నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించడంతో ఈ వైరస్ వలన ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 54 కి చేరింది. మరోవైపు 1680 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లోనే 41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 718 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించారు.
#COVIDUpdates: రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2452 పాజిటివ్ కేసు లకు గాను 1680 మంది డిశ్చార్జ్ కాగా, 54 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 718.#APFightsCorona #COVID19Pandemic
— ArogyaAndhra (@ArogyaAndhra) May 21, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu