ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఇటీవలే ఏడుగురు నూతన న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియమితులైన విషయం తెలిసిందే. హైకోర్టు న్యాయమూర్తులుగా ఈ ఏడుగురు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటూకూరు శ్రీనివాస్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయగా, అనంతరం బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వీరి చేత ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నూతన న్యాయమూర్తులచే ప్రమాణం చేయించడం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా మాతృమూర్తి కన్నుమూసిన కారణంగా, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోవడంతో ఏపీ గవర్నర్ న్యాయమూర్తుల చేత ప్రమాణం చేయించారు.
ముందుగా సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జ్యూడిషయల్ ఆఫీసర్స్ అయిన అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, వక్కలగడ్డ రాధాకృష్ణ కృపా సాగర్, బండారు శ్యామ్ సుందర్, ఊటూకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. అనంతరం వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వారు నేడు న్యాయమూర్తులుగా ప్రమాణం స్వీకారం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY