ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేడు 7గురు న్యాయమూర్తులు కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం అమరావతిలోని మొదటి కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కొద్దిరోజులక్రితం సుప్రీంకోర్టు కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఏడుగురిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది.
దీనిపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో సంబంధిత ఫైలు ముందుకు కదిలింది. దీనిపై తాజాగా కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త న్యాయమూర్తులుగా.. జస్టిస్ కొనకంటి శ్రీనివాస్ రెడ్డి, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ రవి చీమలపాటి, జస్టిస్ వడ్డిబోయన సుజాత నేడు నియమితులయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ