విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా జనసేన-బీజేపీ పార్టీలు సంయుక్తంగా మంగళవారం నాడు ‘రామతీర్థ ధర్మయాత్ర’ చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రామతీర్థ ధర్మయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దమైన పలువురు బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. మరోవైపు పార్టీ శ్రేణులతో రామతీర్థం చేరుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును స్థానిక రామతీర్థం జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందు వలన ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏర్పడ్డ పరిస్థితుల వలన ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని తెలిపారు.
ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా సోము వీర్రాజును అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. జంక్షన్ వద్ద సోము వీర్రాజు అరెస్ట్ సందర్భంగా పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకుంది. సోము వీర్రాజుతో పాటుగా రామతీర్ధం చేరుకున్న పలువురు బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ