మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం సమర్పించి జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తోపాటు పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, శ్రేణులను ఉద్దేశించి పలు అంశాలపై పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE