ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 13 జిల్లాల్లో 2,639 పంచాయతీలు, 19,553 వార్డులకు పోలింగ్ జరిగింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80.64% పోలింగ్ నమోదయినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా ఈ విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 87.09 శాతం పోలింగ్ నమోదు కాగా, విశాఖపట్నం జిల్లాలో అత్యల్పంగా 69.28 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. ఫలితాలు వెలువడిన గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తున్నారు.
జిల్లాలవారీగా పోలింగ్ శాతం వివరాలు:
- తూర్పుగోదావరి: 74.80
- పశ్చిమగోదావరి: 82.73
- కృష్ణా: 84.65
- గుంటూరు: 84.80
- ప్రకాశం: 82.42
- నెల్లూరు: 83.15
- శ్రీకాకుళం: 80.13
- విశాఖపట్నం: 69.28
- చిత్తూరు జిల్లా: 83.04
- అనంతపురం: 80.29
- కడప: 72.85
- కర్నూలు: 83.10
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ