మోదుగులకు షాక్.. అంబటికి గుంటూరు ఎంపీ టికెట్..?

A shock To The Old People Ambatiki Guntur MP Ticket, Ambatiki Guntur MP Ticket, A shock To The Old People, MP Ticket Guntur, Modugula Venugopal Reddy, Ambati Rayudu, AP Politics, YCP, Guntur MP Ticket, Latest Guntur MP Ticket News, Guntur MP Ticket News Update, Guntur, AP MP Elections, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Modugula Venugopal Reddy, Ambati Rayudu, AP Politics, YCP, Guntur MP Ticket

గుంటూరు లోక్ సభ స్థానంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. 2019లో ఓటమి తర్వాత రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న మోదుగుల.. గత ఆరు నెలలుగా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ.. ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ వైసీపీ తనకే ఇస్తుందని ఆశతో ఉన్నారు మోదుగుల. సరిగ్గా ఇదే సమయంలో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చారు క్రికెటర్ అంబటి రాయుడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డిని  కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గుంటూరు ఎంపీ టికెట్ అంబటికేనని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారు.

గతంలో టీడీపీ నుంచి ఎంపీగా, గుంటూరు ఎమ్మెల్యేగా పని చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి.. 2019లో లోక్ సభ ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో ఎలాగైనా మోదుగుల గుంటూరులో గెలిచితీరుతారని వైసీపీ హైకమాండ్ భావించింది. అందుకే ముందు గుంటూరు నుంచి పోటీ చేయించాలని భావించిని లావు శ్రీకృష్ణ దేవరాయులును నరసారావు పేటకు పంపించి.. గుంటూరు టికెట్ మోదుగులకు కట్టబెట్టింది. కానీ చివరికి వచ్చే సరికి ఆ ఎన్నికల్లో మోదుగుల ఓటమిపాలయ్యారు.

ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి కోసం వేణుగోపాల్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వైసీపీ అధిష్టానం ఆయన్ను లైట్ తీసుకుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో.. ఆరు నెలల కింత సీఎం జగన్ నుంచి మోదుగులకు పిలుపువచ్చింది. గుంటూరులో పలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని మోదుగులకు.. జగన్‌ సూచించారు. ఈక్రమంలో తిరిగి తనకే గుంటూరు ఎంపీ టికెట్ దక్కుతుందని ఆయన భావించారు. కానీ అంబటి రాయుడు ఎంట్రీతో మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి షాక్ తగిలినట్లు అయింది.

అటు ఆరేడు నెలలుగా పార్టీకి, సీఎం జగన్‌కు దగ్గరగా ఉంటున్న స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు.. ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్వయంగా జగన్ కండువా కప్పి అంబటిని పార్టీలోకి ఆహ్వానించారు. క్రికెటర్‌గా అంబటి రాయుడికి జాతీయ స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే బలమైన సామాజిక వర్గం అండతో పాటు.. ఆర్థికంగా కూడా అంబటి బలంగా ఉన్నారు. దీంతో వైసీపీ హైకమాండ్ కూడా అంబటి రాయుడికే గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చి పార్లమెంట్‌కు పంపించాలని భావిస్తోందట. ఆ పరిణామాల మధ్య మోదుగల వేణుగోపాల్ రెడ్డి పరిస్థితేంటి అనేది ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + twelve =