ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్ గురువారం నాడు బాధ్యతలు చేపట్టారు. వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాకులో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేయగా, పలువురు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు
ముందుగా సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుండడంతో జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ను నూతన సీఎస్ గా ఎంపిక చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అలాగే పదవీకాలం పూర్తయిన అనంతరం నీలం సాహ్నిను సీఎం వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ