ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న అనంతరం ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. అక్టోబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథితిగా రావాల్సిందిగా మోదీని కోరనున్నారు. వీరిద్దరి మధ్య జరగబోయే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎలు), పోలవరం రివర్స్ టెండరింగ్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. మోదీతో సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో కూడ జగన్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించనున్నారు.
[subscribe]