నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం నుంచి సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆనందయ్య లేఖ రాశారు. మందు తయారీ, సామగ్రి కొనుగోలు సహా ఇతర అంశాలపై సహకారం అందించాలని కోరారు. ప్రస్తుతం జిల్లాకు 5 వేల మందు ప్యాకెట్లు చొప్పున సిద్ధం చేస్తున్నామని, ప్రభుత్వం ద్వారా మందును పంపిణీ చేయించాలని కోరారు.
అలాగే పెద్ద మొత్తంలో మందు తయారు చేసి, ఇతర రాష్ట్రాలకు కూడా పంపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మందు తయారీలో భాగంగా విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ను ఆనందయ్య లేఖలో కోరినట్టు తెలుస్తుంది. మరోవైపు మంగళవారం నాడు నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ జరుగుతుంది. వాలంటీర్ల ద్వారా ఆనందయ్య మందును ఇంటింటికీ అందిస్తున్నారు. ఇక కృష్ణపట్నంలోకి మాత్రం ఆనందయ్య మందు కోసం ఇతర ప్రాంతాల వారిని పోలీసులు అనుమతించడం లేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ