రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్ష సమావేశం నిర్వహణ

2021 Telangana Assembly Session, Mango News, Speaker held Preparatory Meeting, Telangana Assembly Session, Telangana Assembly Session 2021, telangana assembly session dates, Telangana assembly session from September 24, telangana assembly session schedule 2021, Telangana Assembly Session Starts, Telangana Assembly Session Starts From Tomorrow, Telangana Assembly Sessions News

రేపటి నుంచి (సెప్టెంబర్ 24, శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో గురువారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా సంక్షోభం తలెత్తినా కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దేశంలోనే మెరుగ్గా, ఆదర్శంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , నీతిఆయోగ్ చైర్మన్ మెచ్చుకున్నారన్నారు. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ 8వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలి. గత సమావేశాల లాగానే ఆయా శాఖల తరుపున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్ లో అందుబాటులో ఉంచాలి. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలి. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అలాగే గణేష్ నిమజ్జనంను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసినందుకు పోలీసు శాఖకు అభినందనలు. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. గతంలోని ఏడు సమావేశాలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగాయి, ఈసారి కూడా అదేవిధంగా జరగడానికి పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలి. ఇతర రాష్ట్రాల శాసనసభలతో పోల్చుకుంటే మన తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు సమర్ధవంతంగా జరుగుతున్నాయి. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని స్పీకర్ పేర్కొన్నారు.

ఈ సమీక్షకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) అర్వింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, రాష్ట్ర డీజీపీ యం.మహేందర్ రెడ్డి, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ-రవిగుప్తా, డీజీ (ఎస్పీఎఫ్) ఉమేష్ షరాఫ్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, డీజీ (లా & ఆర్డర్) జితేందర్, అడిషనల్ సీపీ (క్రైం)-షీకా గోయల్, జాయింట్ సీపీ (సెంట్రల్ జోన్) విశ్వ ప్రసాద్, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టిఫెన్ రవీంద్ర, అడిషనల్ సీపీ (రాచకొండ) సుదీర్, డీఐజీ ఇంటలిజెన్స్ శివకుమార్, ఇంచార్జి డీఐజీ (ఐఎస్ డబ్ల్యూ) తప్సిన్ ఇక్బాల్, డీసీపీ (ట్రాఫిక్) భాస్కర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, తదితరులు హాజరయ్యారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =