ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 2442 కరోనా పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 4, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996 కు, మరణాల సంఖ్య 13444 కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 2412 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 19,40,368 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,184 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(2442):
- తూర్పుగోదావరి – 477
- చిత్తూరు – 433
- కృష్ణా – 308
- నెల్లూరు – 248
- ప్రకాశం – 228
- గుంటూరు – 170
- పశ్చిమగోదావరి – 152
- కడప – 144
- శ్రీకాకుళం – 81
- విశాఖపట్నం – 77
- కర్నూల్ – 56
- అనంతపూర్ – 45
- విజయనగరం – 23
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ