ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో గవర్నర్ కోటా కింద ప్రభుత్వం ప్రతిపాదించిన 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇటీవలే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, మోషేన్రాజు, రమేష్ యాదవ్, తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఏపీ శాసనమండలిలో ఈ నలుగురు ప్రమాణ స్వీకారం చేసి, పదవులు చేపట్టారు. ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం వీరి చేత ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు ఎమ్మెల్సీలకు వారంతా శుభాకాంక్షలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ