2018 లో పులివెందుల పట్టణంలోని పూలంగళ్లు కూడలి వద్ద జరిగిన ఘర్షణ కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కడప స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు చెన్నై విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు కడప ఎస్పీ అన్బురాజన్ మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో బీటెక్ రవిని సోమవారం ఉదయం పులివెందుల కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. బీటెక్ రవికి 14 రోజుల పాటుగా రిమాండ్ విధిస్తూ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయనను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ