ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 65,500 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరిలో 319, చిత్తూరులో 217, నెల్లూరులో 181, పశ్చిమగోదావరిలో 170, గుంటూరులో 162, ప్రకాశంలో 102 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,93,697 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 16 మరణాలు చోటుచేసుకున్నాయి. చిత్తూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు, పశ్చిమగోదావరిలో ఒకరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13647 కి పెరిగింది. గత 24 గంటల్లో 1,835 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,62,185 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ