కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా బిమాల్ జుల్కా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీఐసీగా బిమాల్ జుల్కా ప్రమాణం చేయించి, బాధ్యతలు అప్పగించారు. ముందుగా ఇప్పటివరకు సమాచార కమిషనర్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్న జుల్కాను సీఐసీగా నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. గత జనవరి 11న ప్రధాన కమిషనర్ సుధీర్ భార్గవ పదవీవిరమణ చేసినప్పటినుంచి సీఐసీ స్థానం ఖాళీగానే ఉంది. మరోవైపు సీఐసీలో మొత్తం 11 కమిషనర్ స్థానాలు ఉండగా, ప్రస్తుతం కేవలం ఆరుగురు మాత్రమే సమాచార కమిషనర్లు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.