ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నామని, భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపడమే దీని ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎం అడ్వైజర్ అజేయ కల్లం, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
‘జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకంపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..
- 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీనిలో మనదైన ముద్ర కనిపించాలి.
- ఆంధ్రప్రదేశ్లో ఇకపై ఎలాంటి భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు కనిపించాలి.
- రీ సర్వే పేరుతో రాష్ట్రంలో మహా యజ్ఞమే ప్రారంభించాం, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలి.
- మొబైల్ ట్రిబ్యునల్స్, సరిహద్దులు, సబ్ డివిజన్స్ వారీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి.
- ఈ సర్వే వల్ల భూమికి సంబంధించిన రికార్డులు, డేటా స్పష్టంగా ఉంటుంది, తద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది.
- అలాగే ఈ సర్వే నిర్వహణకు కోట్లాది రూపాయలతో పరికరాలు కొనుగోలు చేశాం, వేల మంది సిబ్బందిని నియమించుకున్నాం.
- గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే పూర్తయిన అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
- అలాగే సర్వే పూర్తయిన తర్వాత ప్రతి గ్రామంలో ఆర్డీవోలు, జేసీలు భూములకు సంబంధించిన హక్కు పాత్రలను తనిఖీ చేయాలి.
- దీంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టాలని, మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో సర్వే చేపట్టాలి.
- ఇక సీఎం జగన్ ఆదేశాలపై స్పందించిన అధికారులు 2023 జనవరి నుంచి సర్వే ప్రక్రియ మొదలెట్టి ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY