అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మనం-మన అమరావతి’ పాదయాత్ర కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఉండవల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాజధాని విషయంలో రాష్ట్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ‘మనం-మన అమరావతి’ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు రాజధాని అంశంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో రెండు పార్టీలు రాజధాని అంశంలో విఫలమయ్యాయి. రైతుల సమస్యలను పరిష్కరించి వెంటనే రాజధాని పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. (2/2) pic.twitter.com/r9swBkkO5o
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) July 29, 2022
హైకోర్టు ఆదేశాల ప్రకారం అమరావతిలో వెంటనే రాజధాని పనులు ప్రారంభించాలని, అలాగే రైతుల సమస్యలను పరిష్కరించాలని వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించడంపై వీర్రాజు బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ సంకల్ప పాదయాత్ర కొనసాగనుందని, ఆగస్టు 4వ తేదీన సాయంత్రం తుళ్ళూరులో యాత్రను ముగించనున్నామని తెలిపారు. ఆరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ చేపట్టిన యాత్రలో బీజేపీ నాయకులు, అమరావతి ప్రాంత రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ