ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో ‘మనం – మన అమరావతి’ పాదయాత్ర.. ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

AP BJP Chief Somu Veerraju Starts Manam-Mana Amaravati Padayatra in Undavalli Guntur, Somu Veerraju Starts Manam-Mana Amaravati Padayatra in Undavalli Guntur, AP BJP Chief Starts Manam-Mana Amaravati Padayatra in Undavalli Guntur, Manam-Mana Amaravati Padayatra in Undavalli Guntur, Manam-Mana Amaravati Padayatra, Undavalli Guntur, AP BJP Chief Somu Veerraju, BJP Chief Somu Veerraju, Somu Veerraju, AP BJP Chief, Manam-Mana Amaravati Padayatra News, Manam-Mana Amaravati Padayatra Latest News, Manam-Mana Amaravati Padayatra Latest Updates, Manam-Mana Amaravati Padayatra Live Updates, Mango News, Mango News Telugu,

అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మనం-మన అమరావతి’ పాదయాత్ర కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం ఉండవల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ.. రాజధాని విషయంలో రాష్ట్రప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ‘మనం-మన అమరావతి’ పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని, రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు రాజధాని అంశంలో విఫలమయ్యాయని వ్యాఖ్యానించారు.

హైకోర్టు ఆదేశాల ప్రకారం అమరావతిలో వెంటనే రాజధాని పనులు ప్రారంభించాలని, అలాగే రైతుల సమస్యలను పరిష్కరించాలని వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించడంపై వీర్రాజు బీజేపీ వైఖరిని స్పష్టం చేశారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో వారం రోజుల పాటు ఈ సంకల్ప పాదయాత్ర కొనసాగనుందని, ఆగస్టు 4వ తేదీన సాయంత్రం తుళ్ళూరులో యాత్రను ముగించనున్నామని తెలిపారు. ఆరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ చేపట్టిన యాత్రలో బీజేపీ నాయకులు, అమరావతి ప్రాంత రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 16 =