ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి ఈరోజు (బుధవారం) సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన సీఎం జగన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కాగా, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి 1992 బ్యాచ్కు చెందినవారు. 1994లో ఉమ్మడి ఆంధ్రాలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్లో జాయిన్ అయ్యారు.
అనంతరం.. ఏపీ లోని విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలలో బాధ్యతలు నిర్వర్తించారు. సీఐడీ, రైల్వే విభాగాలలో కూడా ఎస్పీగా విధులు నిర్వహించారు. ఈక్రమంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా పనిచేశారు. ఉద్యోగ నిర్వహణలో రాజేంద్రనాథ్ రెడ్డి అనేక కీలక కేసులను ఛేదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే, నిన్నటి వరకు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ను ఆకస్మికంగా తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ఏపీ ప్రభుత్వం అనూహ్యంగా సవాంగ్ స్థానంలో నిన్న రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ