ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరును ఖరారు చేస్తూ ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాలులో దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో అజెండాలోని 42 కీలక విషయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ ఆమోదం పొందిన కీలక అంశాలు
- కోనసీమ జిల్లాను ‘అంబేడ్కర్ కోనసీమ’ జిల్లాగా పేరు మార్పుకు ఆమోదం
- జూన్ 27న 43,96,402 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ‘అమ్మ ఒడి’ నిధుల పంపిణీకి ఆమోదం
- జగనన్న విద్యాకానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర
- రూ. 15 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న అదాని గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్కు ఆమోదం
- వైద్య కళాశాలలు, ఆస్పత్రులలోని మొత్తం 3,530 పోస్టుల భర్తీకి ఆమోదం
- వంశధార ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం కింద రూ. 216 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం
- అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 కింద డిప్యూటీ కలెక్టర్గా నియమించేందుకు ఆమోదం
- ఆక్వాసాగు రైతులకు 10 ఎకరాలు ఉన్నవారికి సైతం సబ్సిడీ వర్తింపుకు ఆమోదం
- 13 ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ల ఆరు నెలలపాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY