ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు (మార్చి 11, శుక్రవారం) ఉదయం 9 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాకులో రాష్ట్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి డా.సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా రేపు ఉదయం రాష్ట్ర కేబినెట్ భేటీ అయి బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ