పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో పలువురు ప్రముఖులు ఓటమి పాలవుతున్నారు. పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చమ్కౌర్ సాహిబ్ మరియు బదౌర్ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా రెండు చోట్ల పరాజయం పొందారు. అలాగే అమృత్సర్ ఈస్ట్ స్థానం నుంచి పోటీ చేసిన పంజాబ్ పీసీసీ ప్రెసిడెంట్ నవజోత్ సింగ్ సిద్ధూ ఓడిపోయారు.
ఇక పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పార్టీ పెట్టి, బీజేపీతో పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో అమరీందర్ సింగ్ కూడా పాటియాలా స్థానం ఓటమి పాలయ్యారు. జలాలాబాద్ నుంచి పోటీ చేసిన శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కూడా పరాజయం పాలయ్యారు.
మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ సత్తా చాటింది. తొలిసారిగా అత్యధిక స్థానాలతో మెజార్టీ దక్కించుకుని పంజాబ్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ధురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీపై భగవంత్ సింగ్ మాన్ 58,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారంగా ఆప్ 65 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 11 స్థానాల్లో, బీజేపీ+ రెండు స్థానాల్లో, ఎస్ఏడీ+ రెండు స్థానాల్లో, ఇతరులు ఒక స్థానంలో విజయం సాధించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ