దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాక ముందు కరోనా కేసులు భారత్ లో తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. కరోనా కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ కంటే.. థర్డ్ వేవ్ లో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒమిక్రాన్ ప్రభావం అధికంగానే ఉంది. దీంతో రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశం అయ్యా రు. కానీ, కరోనా సోకడంతో మంత్రి పేర్ని నాని ఈ సమావేశానికి హాజరుకాలేదు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ