అధికారంలో వున్న వారు ప్రజలకు సేవకులు, ఒదిగి ఉండాలి – క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌

AP CM YS Jagan Attends For The Christmas Teniti Vindu Event at Vijayawada,YS Jagan Attends Christmas Celebrations,Christmas Teniti Vindu,YS Jagan Attends Christmas Teniti Vindu,AP CM YS Jagan,Christmas Dinner Program,AP Govt Christmas Dinner Program,Mango News,Mango News Telugu,Christmas Dinner Program Vijayawada,Vijayawada Christmas Dinner Program,Christmas Dinner Program AP Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,Ap Cm Ys Jagan Mohan Reddy, Ys Jagan News And Live Updates, Ysr Congress Party, Andhra Pradesh News And Updates, Ap Politics, Janasena Party, Tdp Party, Ysrcp, Political News And Latest Updates

అధికారంలో వున్న వారు ప్రజలకు సేవకులని, ఇంకా ఒదిగి ఉండాలని గుర్తించాలని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం సాయంత్రం విజయవాడలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక క్రిస్మస్‌ తేనిటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో తొలుత వేదికపై కేక్‌ కట్‌ చేసి సభికులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, మంత్రి ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడు మన నుంచి ఆశించేది ఒక్కటేనని, అధికారం అనేది అధికారం కాదని, అధికారంలో ఉన్నవారు ప్రజలకు సేవకులని తెలిపారు. పాలకులు ప్రజలకు ఇంకా ఒదిగి ఉండాలని గుర్తు పెట్టుకోవాలని, దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతోనే తాను ఈ స్థానంలో ఉన్నానని వెల్లడించారు. ఇప్పటివరకు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, మున్ముందు ప్రజలకు ఇంకా గొప్ప సేవ చేసే అవకాశం తనకు ఇవ్వాలని ఈ దేవుడిని మనసారా కోరుకుంటున్నానని సీఎం జగన్ ఆకాంక్షించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 7 =