ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలోని మాచర్లలో పర్యటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మాచర్లలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని సత్కరించి రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు.
మాచర్లలో నివసిస్తున్న పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని శుక్రవారం ఉదయం సీఎం వైఎస్ జగన్ సన్మానించారు. సీఎం స్వయంగా తమ ఇంటికి వచ్చి సన్మానించడం పట్ల పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జరిగిన కొన్ని విషయాలను పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మి సీఎంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను సీఎం వైఎస్ జగన్ తిలకించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ