ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్–పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఐజీ లేఅవుట్లను తీర్చిదిద్దాలని, క్లీన్-ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించాలని, ప్రతి ఇంటికీ ప్రతిరోజూ తాగునీరు అందాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రోడ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం చెప్పగా, జూన్నాటికి రోడ్ల పనులు పూర్తిచేస్తామన్న అధికారులు తెలిపారు. అలాగే విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టు కూడా పైనా సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మున్సిపల్–పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డా.సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ