జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

75th Independence Day Celebrations, AP CM YS Jagan, AP CM YS Jagan Hoists National Flag At Indira Gandhi Stadium, AP CM YS Jagan Hoists National Flag at Indira Gandhi Stadium in Vijayawada, CM YS Jagan Hoists National Flag At Indira Gandhi Stadium, Independence Day 2021, Independence Day Celebrations, Independence Day Celebrations In AP, Indira Gandhi Stadium, Mango News, Vijayawada, YS Jagan Hoists National Flag At Indira Gandhi Stadium

ఆంధ్రప్రదేశ్‌లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తరువాత సాయుధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను సీఎం వైఎస్ జగన్ వీక్షించారు.

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న పౌరుడికి, మొత్తంగా 140 కోట్ల భారతీయులకు 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 74 సంవత్సరాలుగా దేశంలో జరిగిన ప్రగతిని, మంచి, చెడును చర్చిస్తున్న సమయమిదని అన్నారు. ఈ చర్చ జరగాలన్నారు. లోపాలను సరిదిద్దుకునేందుకు, కొత్త లక్ష్యాలకు నిర్దేశించుకునేందుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భం అని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుకున్న లక్ష్యాల వివరాలను సీఎం వైఎస్ జగన్ ప్రజలకు వివరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్ర శాసనసభ వద్ద శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి వద్ద ప్రోటెం చైర్మన్ వి.బాలసుబ్రహ్మణ్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − sixteen =